కరెంట్ షాక్ తో రెండు బర్రె దూడలు మృతి

Published: Monday May 17, 2021
పరిగి, 16 మే ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం, దోమ మండల పరిధిలోని దిర్సoపల్లి గ్రామంలో విషాదం  చోటు చేసుకుంది. గాలికి కరెంటు తీగ అయిన LT కండక్టర్ అనే తీగ తెగి అక్కడే ఉన్న రెండు బర్రె దూడలపై పడింది దీనితో అవి అక్కడికక్కడే చనిపోయాయి. ఇది గమనించిన 12 సంవత్సరాల బాలుడు వాటిని కాపాడే ప్రయత్నం చేయగా తన తండ్రి వచ్చి ఆ బాలుడ్ని కాపాడాడు దీనితో బాలుడి కి ప్రాణ పాయం తప్పింది. వివరాల్లోకి వెళితే దిర్సoపల్లి గ్రామంలో ని బొల్లం ఆనంతయ్య పొలం లో తన బర్రె పిల్లల్ని ఎప్పటిలాగే కట్టి తన పని తాను చేసుకుంటున్నాడు గాలికి కరెంట్ తీగ పడి వా టిపై పడి అవి చనిపోవడం జరిగింది. దీనితో రైతు తీవ్రంగా రోధించాడు కన్న బిడ్డల్లాగా చూసుకున్న జీవులు మరణించడం తన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నాయి. అలాగే ఆనంతయ్య మాట్లాడుతూ ఇక్కడ ఒక స్థంభం ఏర్పాటు చేయాలని ఒక స్తంభానికి మరో స్తంభానికి దూరం ఎక్కువ ఉండటం వల్ల గాలికి కదిలి కింద పడ్డాయి అని అన్నాడు. తనని  ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికూలు. వేడుకుంటున్నారు.