వజ్రోత్సవ వేడుకల్లో జిల్లా పండగ వాతావరణం కల్పించాలి ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

Published: Friday September 16, 2022
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 15 (ప్రజాపాలన ప్రతినిది) : జిల్లాలో ఈ నెల 16,17,18, తేదీలలోనిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలతో జిల్లాలో పండగ వాతావరణం కనిపించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సాంబార్లో జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ వాజ్పాయి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవ లక్ష్మి, తో కలిసి వేడుకల సందర్భంగా గోడ పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 16న జిల్లాలోని ఆసిఫాబాద్,సిర్పూర్ నియోజకవర్గాల పరిధిలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు,ప్రజలు అందరూ భాగస్వాములు అయ్యే విధంగా 15వేల మందితో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొనాలని, ర్యాలీ అనంతరం పాల్గొన్న అందరికీ భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు.17వ తేదీన జిల్లా కేంద్రంలో జాతీయ పతాకావిష్కరణ ఉంటుందని,18న వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సాయంత్రం 5 గంటలకు జిల్లా కేంద్రంలోని ఆదివాసి భవన్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని,ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు కృషిచేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు.
 
 
 
Attachments area