సేవ దృక్పదం తో నిత్యవసర సరుకులు పంపిణీ

Published: Monday May 31, 2021
బాలపూర్, మే 30, ప్రజాపాలన ప్రతినిధి : ఏ సమస్యనైనా సునాయాసంగా తీర్చిదిద్ది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మచ్చలేని నాయకుడు అని బీజేపీ నేతలు పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం లోని మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనప్రియ మహానగర్ లో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సుజాత ఆధ్వర్యంలో నిరుపేదలకు శానిటైజర్, ఒక ట్రై గుడ్లు భాజపా కార్పొరేషన్ కార్పొరేటర్ లతో అదేవిధంగా బిజెపి అధ్యక్షులు పెండ్యాల నరసింహ్మ, ప్లోర లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి చేతుల మీదగా పంపిణీ చేశారు. బిజెపి నేతలు మాట్లాడుతూ..... ప్రధాని మంత్రి  సప్తసంవత్సరాలు పూర్తి చేసుకుని భారతదేశ  ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు నిరుపేదలను ఆదుకోవాలినీ సేవ దృక్పథంతో అన్నారు. 7 సంవత్సరాలు సునాయసంగా ఏ సమస్యనైనా పూర్తిగా అవగాహనతో పరిష్కరించిన మన ప్రధాని మనస్తత్వాన్ని చాటాలని అన్నారు. అదేవిధంగా తిరుమల హిల్స్ శానిటేషన్ బాటిల్స్ పేదలకు పంపిణీ చేశారు. యావత్ ప్రపంచం ప్రజలందరూ నరేంద్ర మోడీ బిజెపి పార్టీలో ఉండడం మన గర్వకారణమని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బిజెపి జెండా ఎగరేస్తాంనీ ధీమా వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో పసునూరి బిక్షపతి చారి, ముత్తంగి కరుణానిధి, కీసర హరినాథ్ రెడ్డి, భీమ్ రాజ్, కీసర కృష్ణారెడ్డి, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్, శ్యామ్, కార్తీక్, నాగభూషణం, రవీందర్ గౌడ్, రఘు, శ్రీధర్, పాండు, పెద్దలు పాల్గొన్నారు.