పునఃప్రారంభమైన పాఠశాలల తనిఖీ
Published: Thursday September 02, 2021
జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి కె.జానకి రెడ్డి
వికారాబాద్ బ్యూరో 01 సెప్టెంబర్ ప్రజాపాలన : కరోనా మహమ్మారి కారణంగా సంవత్సరంన్నరగా ప్రత్యక్ష పాఠశాలలు మూతబడ్డాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో బుధవారం (01 సెప్టెంబర్ 2021) నుండి అన్ని విద్యాలయాలు ప్రారంభమయ్యాయి. వికారాబాద్ మండల పరిధిలోని సిద్ధులూర్ జడ్పిహేచెస్, దన్నారం ప్రాథమిక ఉన్నత పాఠశాలలను జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి కె.జానకి రెడ్డి తనిఖీ చేశారు. కరోనా లాక్డౌన్ తరువాత పాఠశాలలు తిరిగి ప్రారంభమయిన సందర్భంగా పాఠశాలలను పరిశీలించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, వసతులను పరిశీలించారు. పాఠశాలలను ప్రతి రోజు శానీటైజెషన్ చేయాలని, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన వెంట సూపరింటేoడెంట్ చెన్నారెడ్డి, రాంరెడ్డి, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, కార్యదర్శి మధుకర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
Share this on your social network: