అమరవీరుల బాట లో పయనిద్దాం.

Published: Thursday November 03, 2022
పాలేరు నవంబర్ 2 ప్రజాపాలన ప్రతినిధి 
అమరుల బాటలో పయనించాలని సీపీఐ ఎంఎల్ ప్రజాపంధా పాలేరు డివిజన్ కార్యదర్శి సీ.వై.పుల్లయ్య సూచించారు. మండల కేంద్రంలో బుధవారం అమరవీరుల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దోపిడి, పీడన అణిచివేత కు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసినట్లు తెలిపారు. భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అనేక మంది అమరులైనారని అన్నారు. అమరుల ఆశయాల సాధన కోసం ప్రతీ ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అమరులైన ప్రతీ ఒక్కరికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఇష్ట ఏరియా కార్యదర్శి పగిడికత్తుల రామదాసు, వెంకటేశ్వర్లు, పి.వెంకటేష్, గూడెల్లి సత్తి, సాలయ్య, లచ్చయ్య, రాంబాబు. రాజశేఖర్, గూడెల్లి లక్ష్మి, కుమారి. రాము, సంగయ్య తదితరులు పాల్గొన్నారు.