అసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేఖానాయక్
Published: Monday September 19, 2022
జన్నారం, సెప్టెంబర్ 18, ప్రజాపాలన: మండలంలోని రైతు వేదికలో నూతనంగా మంజూరైన అసరా పెన్షన్ కార్డులను ఎమ్మెల్యే రేఖానాయక్ చేతుల మీదుగా ఆదివారం పంపిణీ చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోన్కల్ రైతు వేదికలో దివ్యాంగులు, వయెావృద్దులు, ఒంటరి, బీడి చేనేత, గీతా, కార్మికులకు, అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాలలో కూడా నూతన పెన్షన్ దారులు హజరై అసరా పెన్షన్ కార్డులను తీసుకున్నారు. ఈ కార్యాక్రమంలో మండల అధ్యక్షుడు గుర్రం రాజారాం రెడ్డి, మండల కో-కన్వీనర్ మునువర్ అలీఖాన్, పోన్కల్ సర్పంచ్ జక్కు భూమేష్, ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, వయెావృద్దులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: