కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తామని : బీజేపీ

Published: Monday July 05, 2021
బాలాపూర్, జులై 04, ప్రజాపాలన ప్రతినిధి : ప్లాటినం సిటీ కాలనీలో నివాసముండే ఉద్యోగులకు, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, స్థానిక నియోజకవర్గ ఇన్చార్జి అందెల పేర్కొన్నారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27 వ డివిజన్ కార్పొరేటర్ తోట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడిన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సూచి బోర్డులను బిజెపి కంటెస్టెంట్ ఎమ్మెల్యే అందెల శ్రీరాములు యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..... కొత్త కాలనీల కాలనీ వాసులతో పాటు అభివృద్ధి, ఏర్పాటుకి గ్రామాల రూపు రేఖలు మారుతున్నాయని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు. ప్లాటినం సిటీ కాలలో నివాసముండే ఉద్యోగులు స్థానికులు ఏ ఇబ్బందులు ఉన్న పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భవిష్యత్తులో తన వంతు సహకారం పూర్తిగా ఉంటుందని హామీ ఇచ్చారు. స్థానిక కార్పొరేటర్ తోట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ..... ఏడాది చివరి నాటికి రోడ్లు, మరమ్మతులు కొత్త రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తానని కాలనీ వాసులతో అన్నారు. రెండేళ్లలో కృష్ణ వాటర్ ప్రతి ఇంటికి వచ్చేటట్లు కృషి చేస్తానని కార్పొరేటర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ కెనడీ, పవన్, శ్రీకాంత్, ప్రకాష్ రెడ్డి ప్రసాద్ కమలాకర్ గోపి, సహాయ స్థానికులు బీజేపీ నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.