టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసిన వికారాబాద్ కాంగ్రెస్ నాయకులు

Published: Tuesday October 12, 2021
వికారాబాద్ బ్యూరో 11 అక్టోబర్ ప్రజాపాలన : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్కాజిగిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ నేతృత్వంలో వికారాబాద్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి, దారుర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల రఘువీరారెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలతో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని టీ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాలని సూచించారు గ్రామ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ జెండాను చేర్చాలని హితవు పలికారు కార్యకర్తల్లో చైతన్యం తేవాలని టిఆర్ఎస్ ప్రభుత్వం చేసే తప్పులను ఎండగట్టాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆలంపల్లి హాజీ వారి అనుచరులు.