గోవిందాపురం (ఎల్) గ్రామంలో నాగేంద్రఅమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి వెద్య శిబిరం

Published: Monday September 19, 2022
బోనకల్ , సెప్టెంబర్ 18 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందపురం (ఎల్) గ్రామంలో దొంతిబోయిన నాగేంద్రఅమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్షయా కంటి హాస్పిటల్ వారిచే ఉచిత వెద్య శిబిరం నిర్వహించారు.ఇందులో భాగంగా లక్ష్మిపురం, గార్లపడు, గోవిందపురం ప్రజలకు కంటి సంబధందిత పరీక్షలు నిర్వహించి వారికి మందులు పంపిణీ చేశారు. వైద్య శిబిరాన్ని గోవిందపురం సర్పంచ్ ఉమ్మనేని బాబు ప్రారంభించారు. వెద్య శిబిరం నిర్వకులు దొంతిబోయిన నాగేంద్రమ్మ ఫౌండేషన్ చైర్మన్ దొంతిబోయిన వెంకట్రావు మాట్లాడుతూ రాబోయే రోజులో మరిన్ని మంచి కార్యక్రమంలు చేస్తాము అన్ని చెప్పారు. అలాగే గ్రామ సర్పంచ్ కి, పంచాయతీ సిబ్బంది కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఉమ్మనేని రవి, మామిళ్ళ కోటేశ్వరరావు, జయరాజ్, మాధవరావు, గ్రామం ప్రజలు పాళ్ళుగొన్నారు.
 
 
 
Attachments area