మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Published: Friday June 11, 2021

రామచంద్రాపురం, జూన్ 10, ప్రజాపాలన ప్రతినిధి : జీహెచ్ఎంసీ పరిధిలోని కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం భారతి నగర్ డివిజన్ పరిధిలోని బొంబాయి కాలనీలో 44 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులకు, మైక్ సొసైటీలో 18 లక్షల రూపాయలతో నిర్మించనున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలోని మూడు డివిజను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నట్లు తెలిపారు. ప్రతి డివిజన్ పరిధిలో థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిరుపేద ఆరోగ్య పరిరక్షణ కోసం బస్తి దవఖానాలు ఏర్పాటు చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని  తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.