జై శ్రీమన్నారాయణశ్రీమతే రామానుజాయ నమః

Published: Wednesday July 14, 2021

మధిర, జులై 13, ప్రజాపాలన ప్రతినిధి : మధిర ప్రభుత్వ ఆసుపత్రి నందు కరోనా పాజిటివ్ వచ్చి చికిత్స పొందుతున్న పేషెంట్లకు గత 31 రోజుల నుంచి వికాస తరంగిణి మధిర శాఖ ఆధ్వర్యంలో ఆహార తరంగిణి ద్వారా ఉదయం అల్పాహారం మరియు రాత్రి భోజనాలు అందించడం జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కరోనా పేషెంట్లు పూర్తిగా కోలుకొని వెళ్ళటం వలన ఈ కార్యక్రమాన్ని సోమవారంతో ముగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, కమిటీ సభ్యులకు, సేవకులకు వికాస తరంగిణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అంతే కాకుండా మాకు సహకరించిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మరియు ఆసుపత్రి సిబ్బంది అందరికీ మా వికాస తరంగిణి మధిర శాఖ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మధిర పట్టణ మరియు మండలంలో ఉన్న హిందూ బంధువులకు ఆధ్యాత్మికు లకు విజ్ఞప్తి. ఆసక్తిగలవారు వికాస తరంగిణి మధిర శాఖలో సభ్యత్వం తీసుకోవాల్సిందిగా మనవి. సభ్యత్వ రుసుము 200/- రూపాయలు ఒక సంవత్సరమునకదాతలు పుట్టిన రోజులు పెళ్లిరోజులు సందర్భముగా నిరుపేద కుటుంబాలకు అన్నదానము, నిత్యావసర సరుకులు, వస్త్రదానములు గాని ఇవ్వదలచిన వారు కమిటీ వారిని సంప్రదించిన యెడల మీ పేరుమీద వారికి వికాస తరంగిణి ఆధ్వర్యంలో అందించటం జరుగుతుంది. సంప్రదించవలసిన చిరునామా కుంచం కృష్ణారావు, అధ్యక్షులు వికాస తరంగిణి మధిర శాఖ, సెల్ నెంబర్ 9440162180, 9030278644