గుమ్మడిదల మండలంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

Published: Wednesday April 28, 2021

గుమ్మడిదల, ఏప్రిల్ 27, ప్రజాపాలన ప్రతినిధి : గుమ్మడిదల మండలం లో కరోనా విలయ తాండవం చేస్తోంది. కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పరీక్షల్లో 57 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా 17 మందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని వైద్యుడు శ్రీధర్ పేర్కొన్నారు. కేసుల వారీగా వివరాలను వివరించారు గుమ్మడిదల లో 7, బొంతపల్లి లో 3, దోమడుగు లో 4, ఇతర చోట్ల మూడు కేసులు నమోదైనట్లు గా వైద్యులు వెల్లడించారు.