11వ రోజు కొనసాగిన విఆర్ఎ ల నిరవధిక సమ్మె

Published: Friday August 05, 2022
మంచిర్యాల టౌన్, ఆగష్టు 04, ప్రజాపాలన : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయ మైన డిమాండ్లను పరిష్కరిం చాలంటూ విఆర్ఎ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు  మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల్ విఆర్ఎ లు చేపట్టిన నిరవదిక  సమ్మె గురువారం నాటికి 11వ రోజున కొనసాగిం చారు.ఈసందర్భంగా  డా.బి.ఆర్.   అంబెడ్కర్ విగ్రహానికి  వారి సమస్య ల పై వినతి పత్రం అందజేశారు.  ఈ సమ్మెలో నస్పూర్ వి ఆర్ ఎ ల మండల అధ్యక్షుడు సురిమిల్ల కార్తీక్, ప్రధాన కార్యదర్శి ఐయితే రత్నం, ఉపాధ్యక్షుడు ఇరికిల్ల భీమరాజు, తదితరులు పాల్గొన్నారు.