శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జమలాపురం హుండీ

Published: Friday December 02, 2022

లెక్కింపు ఎర్రుపాలెం డిసెంబర్ 1 ప్రజాపాలన ప్రతినిధి ఎరుపాలెం మండలంశ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జమలాపురం, ఎర్రుపాలెం మండలం నందు భక్తులు సమర్పించిన కానుకల హుండీ జగన్మోహన్రావు కార్య నిర్వహణ అధికారి ఆధ్వర్యంలో ఈ రోజు  లెక్కించగా 72 రోజులకు గాను 4085701రూపాయల ఆదాయం వచ్చినట్టు దేవాలయ శాఖ పరిశీలికలు ఆర్ సమత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఫౌండర్ ట్రస్ట్ ఉప్పల కృష్ణమోహన్ శర్మ, సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్ ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస్ సీనియర్ అసిస్టెంట్ కె విజయ్ కుమారి సిబ్బంది మరియు సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.