ప్లాస్టిక్ కవర్లు వినియోగించిన, విక్రయించిన జరిమానా - రాయికల్ మున్సిపల్ అధికారులు

Published: Friday May 20, 2022

రాయికల్, మే 19 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ పట్టణంలో వర్తక,వాణిజ్య, చిరు వ్యాపారులు వారి దుకాణాలలో ప్లాస్టిక్ వినియోగించి, విక్రయించినవారిని మున్సిపల్ అధికారులుపట్టుకొని జరిమానావిధించారు. అనంతరం రోడ్లపై కూరగాయలు విక్రయిస్తున్న వారిని కూరగాయలమార్కెట్లోకి పంపించివేసి,ఇక పై కూరగాయలు,పండ్లు  రోడ్డు పై అమ్మినట్లయితే జరిమానావిధిస్తామని అధికారులుతెలిపారు. ఈ కార్యక్రమంలో  మునిసిపల్ కార్యాలయ మేనేజర్ వెంకట్, కార్యాలయ సిబ్బంది మచ్చ సుదర్శన్,ప్రసాద్,ఏజాజ్, తదితరులుపాల్గొన్నారు.