బొమ్మర రామూర్తి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ ప్రచార భాగంగా హుజరాబాద్ పర్యటన

Published: Monday October 25, 2021

మధిర, అక్టోబర్ 24, ప్రజాపాలన ప్రతినిధి : హుజురాబాద్ ఉప ఎన్నికల్లోనే భాగంగా ఇల్లంతకుంట మండలంలో టేకుర్తి, సిరిసేడు మర్రి వానపల్లి, గడ్డి వానపల్లి, పాతర్ల పల్లి గ్రామాల్లోని ఇంటింటికి తిరుగుతూ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్న టిఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ బొమ్మెర రామ్మూర్తితో కలిసి ప్రచారం నిర్వహిస్తున్న అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం ఏది అభివృద్ధి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉందని మన రాష్ట్రంలో ఆదర్శంగా తీసుకుని అనేక సంక్షేమ పథకాలు వేరే రాష్ట్రాల్లో కూడా అదేవిధంగా నడుస్తున్నారని దానిలో భాగంగా 20 సంవత్సరాలు పార్టీ పెట్టి కెసిఆర్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు అభివృద్ధి చూసి తెలంగాణ రాష్ట్రం పెట్టిన సంక్షేమ ఫలాలు హుజరాబాద్ లో అభ్యర్థి గెలుపు లక్ష్యంగాఉందని తెలిపారు తెలంగాణ జాగృతి మధిర నియోజకవర్గ ఇంచార్జ్ బొబ్బిళ్ళపాటి బాబురావు ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ నాయకులు దోర్నాల దినకర్, సతీష్ మహాజన్ చేకూరి, సాయి నాయక్, చిన్న రాయుడు