పోల్కంపల్లి గ్రామాన్ని ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తామని సర్పంచ్ చెర

Published: Thursday May 19, 2022

ఇబ్రహీంపట్నం మార్చి తేది 18 ప్రజాపాలన ప్రతినిధి.

గ్రామాభివృద్దే లక్ష్యం సర్పంచ్ చెరుకూరి అండాలుగిరి
గ్రామాభివృద్దే లక్ష్యంగా తామంతా కృషి చేస్తున్నట్లు పోల్కంపల్లి సర్పంచ్ చెరుకూరి అండాలుగిరి అన్నారు.బుధవారం గ్రామంలోని పలు వార్డులో సీసీ రోడ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ఎంపీడీఓ క్రాంతికిరణ్, ఎంపీటీసీ మంగ రవీందర్,పాలక వర్గంతో కల్సి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చెరుకూరి అండాలుగిరి మాట్లాడుతూ.. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే గ్రామంలో మౌలిక వసతుల కల్పన కోసం తామంతా సమిష్టిగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. వీధిదీపాలు,అంతర్గ మురుగు కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి సకారంతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయనున్నట్లు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొమ్మిడి జంగారెడ్డి, వార్డు సభ్యులు పి స్వరూప, పి బాలకిషన్,కె. శోభ,ఎన్.యాదగిరి రెడ్డి, వి. మల్లమ్మ, సి. మహేందర్ రెడ్డి ఏపీఓ లలిత,  ఈసీ విమల , టీఏ పద్మా తదితరులు పాల్గొన్నారు.