సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
Published: Saturday August 20, 2022
మధిర జూలై 19 ప్రజా పాలన ప్రతినిధి మండలంలోని శుక్రవారం నాడు పలువురికి సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను మంగళవారం మండల కాంగ్రెస్ కార్యాలయంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దినేని గూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు కి అరవై వేల రూపాయలు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ లీడర్, మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క సిఫార్సుతో వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరైనట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ ప్రజల కష్ట కాలంలో భట్టి విక్రమార్క నిరంతరం అండగా ఉంటూ ఆపదలో ఉన్న అనేక మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. భట్టి విక్రమార్క నిరంతరం కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా రని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సేవా వేణు ఐఎన్ టియుసి కార్మిక విభాగం నియోజకవర్గ ఇంచార్జి కోరంపల్లి చంటి పట్టణ మైనార్టీ అధ్యక్షుడు షేక్ జహంగీర్ బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు బిట్ర ఉదండయ్య మండల సేవాదళ్ అధ్యక్షులు ఆదూరి శ్రీను ఆదిమూలం శ్రీనివాసరావు మైలవరపు చక్రి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: