కోదండరాం కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి

Published: Tuesday March 02, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి: ప్రస్తుతం జరుగనున్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో భాగంగా తెలంగాణ జన సమితి పార్టీ అభ్యర్థి ప్రోపెసర్ కోదండరాంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వలిగొండలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ కోదండరాం ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టిజెఎస్ పార్టీ అధ్యక్షుడు బుంగ సునిల్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలలో టిఆర్ఎస్ పార్టీ విఫలమైందని అన్నారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చే ప్రొఫెసర్ కోదండరామ్ ను శాసన మండలికి పంపాలని ఆయన కోరారు.