యాదాద్రి ఆలయ గోపురానికి విరాళాలు అందజేసిన మేయర్లు జక్క వెంకట్ రెడ్డి సామల బుచ్చిరెడ్డి
Published: Friday October 29, 2021
మేడిపల్లి, అక్టోబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు యాదాద్రి శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం నిమిత్తం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ప్రజల నుండి సేకరించిన దాదాపు రూ 19.03లక్షల నగదును మరియు బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి రూ 2లక్షల21వేల116. రూపాయల నగదును మరియు బోడుప్పల్ కార్పొరేషన్ ప్రజలనుండి కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు సేకరించిన రూ 25 లక్షల రూపాయల నగదును కార్మికశాఖామాత్యులు చామకూర మల్లారెడ్డితో కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవ రెడ్డి, కార్పొరేటర్లు, కో అప్షన్ సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: