బోడుప్పల్ కార్పొరేషన్లో వసతుల కల్పనకు కృషి మంత్రి చామకూర మల్లారెడ్డి
Published: Wednesday September 28, 2022
మేడిపల్లి, సెప్టెంబరు 27 (ప్రజాపాలన ప్రతినిధి)
బోడుప్పల్ కార్పొరేషన్లో మౌలిక వసతుల కల్పనకు తన సహాయ, సహకారాలు ఉంటాయని కార్మికశాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ రాజీవ్ నగర్ లో రూ 40 లక్షలతో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ దానగళ్ల అనిత యాదగిరి, మేయర్ సామల బుచ్చిరెడ్డిలతో కలిసి మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ కొత్త రవి గౌడ్, టీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: