నేటి రాస్తారోకోనీ విజయ వంతం చేయండి

Published: Monday September 13, 2021
ఐక్యవేదిక నాయకులు రేగుంట కేశవ్ రావు
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 12 (ప్రజాపాలన) : సైదాబాద్ లోని చిత్ర ఢిల్లీ పోలీస్ అధికారిని సబియా పై అత్యాచారం చేసి హతమార్చిన దుండగులను కఠినంగా శిక్షించి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నేడు సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే రాస్తా రోకో కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలని ఐక్యవేదిక నాయకులు రేగుంట కేశవరావు మాదిగ కోరారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉదయం 11.30 గం కు కార్యక్రమం ఉంటుందని  కులమతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ హన్నాన్, శివ కుమార్, (జర్నలిస్ట్)అబ్దుల్ రెహమాన్, సాగర్, సోజర్, దిలీప్, తదితరులు పాల్గొన్నారు.