6, 7, 8 తరగతులు ప్రారంభం
Published: Wednesday February 24, 2021
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి 6, 7, 8, తరగతులను వివిధ పాఠశాలల్లో ప్రారంభించుకోవచ్చుని తెలిపారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. కోవిడ్ 19 ప్రత్యేక మార్గదర్శకాలు పాటిస్తూ రేపటి నుంచి మార్చి ఒకటో తేదీ లోపు ఎప్పుడైనా రగతులు ప్రారంభించుకోవచ్చు అని పాఠశాలలకు సూచించారు. అదేవిధంగా పాఠశాలలకు వచ్చే ప్రతి విద్యార్థులు తల్లిదండ్రుల అనుమతి పత్రం తప్పనిసరిగా తీసుకురావాలని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
Share this on your social network: