నేడే బెల్లంపల్లిలో మంత్రి హరీష్ రావు పర్యటన వంద పడకల ఆసుపత్రి, డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభ
Published: Thursday December 29, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 28 ప్రజా పాలన ప్రతినిధి: రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ, మంత్రి, తన్నీరు హరీష్ రావు గురువారం బెల్లంపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు.
బుధవారం స్థానిక నెంబర్ టు గ్రౌండ్ లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడే బహిరంగ సభ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు, అనంతరం మాట్లాడుతూ, బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 30 పడకల నుండి వంద పడకలకు పెంచిన నూతన ఆసుపత్రి నిర్మాణం పూర్తయిన సందర్భంగా ఆస్పత్రిని ప్రారంభిస్తూ, డయాలసిస్ కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారని,
అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొని, మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి వెళ్ళిపోతారని కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన తెలిపారు.
Share this on your social network: