సల్బత్తాపూర్ రాజేందర్ రెడ్డికి ఆర్థిక సాయం అందజేసిన వడ్ల నందు

Published: Thursday December 29, 2022
ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ ఆసుపత్రి యాజమాన్యానికి చెక్కు అందజేస్తున్న వడ్ల నందు
వికారాబాద్ బ్యూరో 28 డిసెంబర్ ప్రజాపాలన : సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన రాజేందర్ రెడ్డి రెండు కిడ్నీల వైద్య చికిత్సకు వడ్ల నందు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశామని వడ్ల నందు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంట్వారం మండల పరిధిలోని సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన రాజేందర్ రెడ్డి రెండు కిడ్నీలు పాడవడంతో వైద్య ఖర్చులు పెరిగాయని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మొత్తం బిల్లు రూ. 8,50,000  కాగా వడ్ల నందు ఫౌండేషన్ చైర్మన్ వడ్ల నందు  మాట్లాడి 2,00,000 బిల్లు మినహాయింపు చేసిన అనంతరం రూ. 5,00,000 బాధితులు చెల్లించారన్నారు. ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి వికారాబాద్ జిల్లాకు చెందిన వడ్ల నందు ఫౌండేషన్ చైర్మన్ వడ్లందు తన వంతు సాయంగా 1,50,000 రూపాయలు ఆస్పత్రి యాజమాన్యానికి అందజేశారు. ఆస్పత్రి సూపరిండెంట్ రవికి బుధవారం వడ్ల నందు ఫౌండేషన్ చైర్మన్ టిఆర్ఎస్ యువజన నాయకులు వడ్ల నందు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి వడ్లనందుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రాజేందర్ రెడ్డి చికిత్స  సమయంలో తన  సాయంగా లక్ష రూపాయలు అందిస్తానని హామీ ఇచ్చి ప్రస్తుతం మొత్తం లక్ష యాభై వేల రూపాయలను చికిత్స నిమిత్తం అందజేసినట్టు నందు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాల సోమారం సర్పంచ్ నరసింహారెడ్డి నాయకులు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు