ఉపాధి హామీ పనులను త్వరలో ప్రారంభించాలి

Published: Wednesday February 01, 2023
* వికారాబాద్ ఎంపిడిఓ మల్గ సత్తయ్య
వికారాబాద్ బ్యూరో 31 జనవరి ప్రజాపాలన : ఉపాధి హామీ పనులను త్వరలో ప్రారంభించాలనే వికారాబాద్ ఎంపీడీవో మల్గ సత్తయ్య అన్నారు. మంగళవారం వికారాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో మల్గ సత్తయ్య అధ్యక్షతన క్షేత్రపాలకులకు పంచాయతీ కార్యదర్శులకు టెక్నికల్ అసిస్టెంట్లకు ఏపిఓ ఈసిలకు ఉపాధి హామీ పనులు వెంటనే ప్రారంభించటానికి  తీసుకోవాల్సిన చర్యల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామాల వారీగా ఏఏ పనులు చేయాలో వాటి కనుగుణంగా డిమాండ్ పెట్టి ప్రతి జిపికి 50 మంది ఉపాధి హామీ కూలీలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. National Mobile Monitoring System ఎన్ఎంఎంఎస్ ( నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం ) యాప్ లో  రోజు వారీ ఫోటోలు పంపించాలి అని ఆదేశించారు.