మిషన్ భగీరథ త్రాగునీటిపై అవగాహన సదస్సు ముఖ్యఅతిథిగా పాల్గొన్న మిషన్ భగీరథ ఏఈ ఎర్ర శ్రీ

Published: Monday July 04, 2022

బోనకల్, జులై 3 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని తుటీకుంట్ల, గోవిందపురం (ఏల్)గ్రామాలలో మిషన్ భగీరథ. త్రాగునీటిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆర్వో వాటర్ తాగడం వల్ల ఆరోగ్యపరంగా కలిగే అనర్ధాలు ,మిషన్ భగీరథ వాటర్ తాగడం వల్ల ఆరోగ్యం పరంగా కలిగే లాభాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో, మిషన్ భగీరథ. ఏఈ, ఎర్ర శ్రీనివాసరావు, మైక్రో బయాలజిస్ట్ వేల్పుల నగేష్ , ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు, కార్యదర్శులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.