ఓటు హక్కు వినియోగించుకున్న 32వ వార్డ్ కౌన్సిలర్ మల్లేపల్లి నవీన్ కుమార్
Published: Monday March 15, 2021
వికారాబాద్ జిల్లా, ప్రతినిధి మార్చి 14 ( ప్రజా పాలన ) : ప్రతి పట్టభద్రుడు తమ ఓటు హక్కును ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకోవాలని 32వ వార్డు కౌన్సిలర్ మల్లేపల్లి నవీన్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా న్యాయబద్ధంగా ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సురభి వాణిదేవికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పేర్కొన్నారు. ఓటింగ్ సరలి అంచనాను అనుసరించి ఎస్ వాణిదేవి భారీ మెజారిటీతో గెలువనున్నారని జోస్యం చెప్పారు. విద్యావంతులు, యువకుల సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం, అవకాశం ఉన్న వారికి ఓటు వేయాలని అన్నారు. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనరన్న అపవాదును తొలగించుకునేలా భారీ ఎత్తున పట్టభద్రులు ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు.
Share this on your social network: