మార్కెట్ కమిటీ చైర్మన్ ను తొలగిస్తే ఆందోళనే

Published: Monday August 23, 2021
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు రేగుంట సాగర్
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి జూలై 22(ప్రజాపాలన) : మార్కెట్ కమిటీ చైర్మన్ (ఏఎంసి)ను తొలగిస్తే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు రేగుంట సాగర్ మాదిగ హెచ్చరించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రేగుంట సాగర్ మాట్లాడుతూ రెబ్బెన మండలం లోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దళిత మహిళ వనజ కు గత ఏడాది నవంబర్ 5న ఆమె కష్టాన్ని గుర్తించి టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, అదిస్థానం మార్కెట్ కమిటీ చైర్మెన్ (ఏఎంసి) పదవిని ఇచ్చిందని గుర్తు చేశారు. ఏడాది కాకముందే నిబంధనలకు విరుద్ధంగా మరో వర్గానికి చెందిన వైస్ చైర్మన్ గా ఎంపికైన గాదే వేణి మల్లేష్ కు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దళిత మహిళ వనజ ను తొలగించే ప్రయత్నం చేస్తే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు రేగుంట మహేష్ మాదిగ, బొమ్మి నా గోపాల్, రవి వెంకన్న లక్ష్మణ్, వేణు, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.