ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 5 ప్రజాపాలన ప్రతినిధి *నేడు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని జయప్రదం
Published: Thursday April 06, 2023
**మున్సిపల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అల్వాల వెంకట్ రెడ్డి, మడుపు వేణుగోపాల్ రావు**
ఇబ్రహీంపట్నం పట్టణ కేంద్రంలో గల శాస్త్ర గార్డెన్స్ లో ఉదయం 10 గంటలకు నేడు బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ అధ్యక్ష కార్యదర్శులు అల్వాల్ వెంకట్ రెడ్డి, మడుపు వేణుగోపాల్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్ , బిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి), మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి హాజరవుతారని తెలిపారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్య కార్యకర్తలు తదితరులు సమయపాలన పాటించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.
Share this on your social network: