నీట మునిగిన కాలనీలలో పర్యటించిన కార్పొరేటర్ మేయర్

Published: Friday September 30, 2022
మేడిపల్లి, సెప్టెంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి)

బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని చెంగిచెర్ల 3వ డివిజన్లో  కురుస్తున్న వర్షాలకు వెంకట సాయి నగర్, ఎంఎల్ఆర్  కాలనీ,ఆర్టీసీ కాలనీలలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నీట మునిగిన ప్రాంతాలను స్థానిక కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ తో కలిసి మేయర్ సామల బుచ్చిరెడ్డి పర్యటించారు. నీరు నిలవకుండా తగిన ఏర్పాట్లు చేయాలని మేయర్ మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు.