ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 1 ప్రజాపాలన ప్రతినిధి *విద్యార్థులకు చేయూతనిస్తు *స్టడీ మెటీరియల్

Published: Thursday February 02, 2023

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రతి సంవత్సరం  10వ తరగతి చదువుతున్న తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ ను మర్రి నిరంజన్ రెడ్డి ఫౌండేషన్  ద్వారా అందజేస్తున్నారు, అందులో భాగంగా ఈ రోజు తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ మరియు యంజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు & ఇంగ్లీష్ మీడియం స్టడీ మెటీరియల్ ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు & ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాయకులు   మర్రి నిరంజన్ రెడ్డి  ఉచితంగా విద్యార్థినీ విద్యార్థులకు అందజేశారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు, పాఠశాలలోని ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందం మర్రి నిరంజన్ రెడ్డి ని సన్మానించారు, స్టడీ మెటీరియల్ అందుకున్న విద్యార్థిని విద్యార్థులు మర్రి నిరంజన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో యంజాల హై స్కూల్ ప్రిన్సిపల్ రాందాస్, మన్నెగూడ హై స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి, స్థానిక కౌన్సిలర్లు అనురాధ దర్శన్, యాదగిరి, నాయకులు సామ భీమ్ రెడ్డి ,పన్నాల మధుసూదన్ రెడ్డి, ఎమ్మెన్నార్ యువసేన ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి,  ప్రదీప్ రెడ్డి, ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు, ఎమ్మెన్నార్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.