15వ రోజుకు చేరిన ఆహార పంపిణీ కార్యక్రమం

Published: Tuesday June 01, 2021

బెల్లంపల్లి, మే 31, ప్రజాపాలన ప్రతినిధి : లాక్ డౌన్ సందర్భంగా కరోనా బాధిత కుటుంబాలకు సరఫరా చేస్తున్న ఆహార పంపిణీ కార్యక్రమం బెల్లంపల్లి పట్టణంలో 15వ రోజుకు చేరుకుంది. బెల్లంపల్లి పట్టణం లోని కరోనా ఐసొలేశన్ కేంద్రంలో కరోనా బాధిత కుటుంబాలకు లాక్ డౌన్ సందర్భంగా తిండి దొరకని పరిస్థితుల్లో వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మాజీ మంత్రి గడ్డం వినోద్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆహార పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు, సోమవారం నాటికి పదిహేను రోజులు పూర్తి చేసుకుని నిరాటంకంగా కొనసాగుతుందని లాక్ డౌన్ విరమించే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని గడ్డం వినోద్ అనుచరులు  తెలిపారు.