డే స్ప్రింగ్ అనాథ ఆశ్రమంలో ప్లేట్లు, గ్లాసులు పంపిణ చేసిన వినోదకుమార్.

Published: Monday December 26, 2022

చేవెళ్ల డిసెంబర్‌25,(ప్రజాపాలన):-

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని డే స్ప్రింగ్‌ హౌస్ అనాథాశ్రమంలో ప్లేట్లు గ్లాసులు పంపిణీ  చేసిన వినోద్ కుమార్.
చేవెళ్ల మండల. కేంద్రంలోని అంతారం గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు బేగరి వినోద్‌కుమార్‌ శంకర్పల్లి లోని డే స్ప్రింగ్ హౌస్ అనాధాశ్రమంలో ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. అనంతరం వారు చిన్నారుల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆర్‌ఎంపీ వైద్యుడు బేగరి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. డే స్ప్రింగ్‌ హౌస్ అనాథాశ్రమంలో గత ఆరు సంవత్సరాలుగా చిన్నారులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని, మున్ముందు  మరిన్ని  సేవలు అందించి, అనాథాశ్రమానికి చేయూతనందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకులు పాస్టర్‌ మల్లేశం, పురుషోత్తం, అనాథ చిన్నారులు పాల్గొన్నారు.