యూనియన్ బ్యాంకులో చోరీకి ప్రయత్నించిన దొంగలు

Published: Friday November 04, 2022

మధిర రూరల్ నవంబర్ 3 (ప్రజాపాలన ప్రతినిధి) ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధిర బ్రాంచ్ లో బుధవారం రాత్రి చోరీ చేసేందుకు దొంగలు విశ్వ ప్రయత్నం చేసి విఫలమయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మధిర పట్టణంలోని వాసవి థియేటర్ పక్కన ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధిర బ్రాంచ్లో రోజువారీగా విధులు ముగించుకొని బుధవారం సిబ్బంది వెళ్ళిపోయారు గురువారం ఉదయం విధులకు వచ్చిన బ్యాంకు సిబ్బంది బ్యాంకు ఎనక వైపు తలుపు వద్ద పెద్ద ఇనప గడ్డి తో తలుపును పగలగొట్టేందుకు ప్రయత్నించిన ఆనమాలు కనిపించడంతో వెంటనే బ్యాంక్ మేనేజర్ నాగుల మీరా టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో సీఐ మురళి సంఘటన స్థలానికి వెళ్లి దుండగులు చోరీకి ప్రయత్నించిన బ్యాంకు వెనక తలుపును పరిశీలించారు. ఉన్నతాధికారులకు ఆయన సమాచార ఇవ్వటంతో వైరా ఏసిపి రెహమాన్ మధిర యూనియన్ బ్యాంకు ను పరిశీలించారు అనంతరం క్లూస్ టీమ్ ను మరియు డాగ్స్ రప్పించారు. డాగ్స్ వాసవి థియేటర్ వరకు వెళ్లి ఆగిపోయాయి. ఈ సందర్భంగా సిఐ మురళి మాట్లాడుతూ బ్యాంకు మేనేజర్ నాగుల మీరు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.