జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః

Published: Monday July 26, 2021
మధిర, జులై 25, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ వికాస తరంగిణి మధిర శాఖవారి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయము నందు కరోనా రాకుండా ఉండటానికి మరియు వచ్చి తగ్గిన వారికి మరియు పాజిటివ్ ఉన్న వారికి కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందుటకు దివ్య సాకేతం శంషాబాద్, హైదరాబాద్ క్షేత్రము నందు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి పర్యవేక్షణలో తయారైనటువంటి ఆయుర్వేద మందును దాతలు కీర్తిశేషులు దోసపాటి లక్ష్మీకాంతమ్మ మరియు నంబూరు శివ సత్యనారాయణ ధర్మపత్ని సీతామహాలక్ష్మి గార్ల జ్ఞాపకార్ధం వారి కుమారుడు నంబూరు శ్రీరామమూర్తి మరియు మనవడు యషిక మనీ సర్వీసెస్ అండ్ కమ్యూనికేషన్స్ అధినేత సాయి మణికృష్ణ దిలీప్ కుమార్ అయ్యప్ప గార్ల ఆర్థిక సహకారంతో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి మధిర శాఖ అధ్యక్షులు కుంచం కృష్ణారావు, కమిటీ సభ్యులు చారు గుండ్ల నరసింహమూర్తి కురువెళ్ళ వెంకట పురుషోత్తమరావు కృష్ణ కోమటీడి శ్రీనివాసరావు దాచేపల్లి రాము, నంబూరు మురళీకృష్ణ, మహంకాళి రామకృష్ణ తిలక్, చేడే రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొనడం జరిగింది