రైతుభీమా చెక్కు అందజేత

Published: Thursday June 17, 2021
పరిగి, జూన్ 16, ప్రజా పాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా దోమ గ్రామానికి చెందిన చాకలి యాదమ్మ 55 అనే రైతు ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. మృతురాలి కుటుంబానికి రైతు బీమా ద్వారా ఐదు లక్షల రూపాయల చెక్కును కుమారుడు బసప్ప కు జడ్పీటీసీ కె నాగిరెడ్డి బుధవారం ఎమ్మెల్యే నివాసంలో అందజేయడం జరిగింది.