మెడికల్ కళాశాల సాధన కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర

Published: Thursday June 24, 2021

బెల్లంపల్లి, జూన్ 23, ప్రజాపాలన ప్రతినిధి: మంచిర్యాల జిల్లా కు కేటాయించిన మెడికల్ కళాశాలను బెల్లంపల్లిలో ఏర్పాటు చేయాలని ఏర్పడిన మెడికల్ కళాశాల సాధన కమిటీ రెండో రోజు బుధవారం నాడు స్థానిక అగర్వాల్ భవన్ నుండి భారీ పాదయాత్ర నిర్వహించి ఆర్ డి ఓ శ్యామల దేవికి వినతి పత్రం సమర్పించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్ని వసతులు కలిగి ఉన్న బెల్లంపల్లి పట్టణంలోనే మెడికల్ కళాశాలను నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్ఏ శ్రీదేవి, మాజీ మునిసిపల్ చైర్మన్ ఎం.సూరిబాబు, బెల్లంపల్లి బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్ కొయ్యల ఏమాజి, కాంగ్రెస్ ఇంచార్జ్ చిలుముల శంకర్, కాంగ్రెస్ కౌన్సిలర్స్ బండి ప్రభాకర్, విజయలక్ష్మి, బీజేపీ కౌన్సిలర్ అనితరాజులాల్ యాదవ్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కంకటి శ్రీనివాస్, నాయకులు గేల్లి జయరాం మాజీ కౌన్సిలర్ రొడ్డ శారదా, ప్రముఖ వ్యపారవేత్త తేజ్ ప్రకాశ్ అగర్వాల్. బీజేపీ జిల్లా కార్యదర్శి గోవర్ధన్, కేషవరెడ్డి, శనిగారపు శ్రావణ్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు అమనుల్లాఖాన్, సీపీఐ నాయకులు చిప్ప నర్సయ్య. లాయర్లు చేను రవికుమార్, సంగీత. హెచ్ ఎం ఎస్ నాయకులు గౌస్. బి ఎం ఎస్ నాయకులు వెంగల రాజమల్లు. ఫర్వాడ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి బత్తుల మధు. సీపీఐఎంఏల్ రెడ్ స్టార్ గోగర్ల శంకర్. ఎంపీటీసీ ముడిమడుగుల మహేందర్. హోటల్ యూనియన్ అధ్యక్షులు రాజలింగు.యువజన నాయకులు పోచంపల్లి హరీష్. ఎలుక ఆకాష్. బ్రాహ్మణ సంఘం, అనిల్ మిశ్రా, తదితరులు పాల్గొన్నారు.