ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 15 ప్రజాపాలన ప్రతినిధి *సంత్ సేవాలాల్ జయంతి ఘనంగా నిర్వహించారు*

Published: Thursday February 16, 2023
మునుగోడు ఎలక్షన్లో మాట ఇచ్చిన గిరిజన బందుకు బడ్జెట్ లో నిధులు ఎందుకు కేటాయించలేదు వదిగళ్ల బాబు బీఎస్పీ అధ్యక్షులు తుర్కయంజల్ మున్సిపాలిటీ  తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్వర్యంలో సంత్ సేవలాల్ గారి జయంతి నీ తుర్కయాంజల్ కూడలిలో అంబేద్కర్ చౌరస్తలో నిర్వహించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు వదిగళ్ళ బాబు మాట్లాడుతూ మునుగోడు ఎలక్షన్ ల ముందు మాట ఇచ్చిన గిరిజన బంధుకు బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడంతో ఈ బారాస ప్రభుత్వానికి గిరిజనుల మీద వున్న ఆసక్తికి నిదర్శనం అని,ప్రతి ఎన్నికల ముందు హామీలు, నోటిఫికేషన్ పేరుల మీద ప్రజా వ్యతిరేకత నీ కప్పి పుచ్చుకోవడం ఈ కేంద్ర,రాష్ట్ర  ప్రభుత్వాలకి మామూలుగా మారిందని ఇక పై ఇలాంటి విషయాలను గమంచి రానున్న ఎన్నికల్లో మాటల ప్రబుత్వలకు కాకుండా, మన సంపూర్ణ అభివృధి దేయంగా అదే మానిఫెస్టో గా వున్న ఏకైక పార్టీ ఏనుగు గుర్తు గల బహుజన సమాజ్ పార్టీ కి వోట్ వేసి గత 75 ఎండ్లుగ ఏ మాత్రం అభివృధి కి నోచుకోని తండా లను గూడలను సంపూర్ణ అభివృధి దోహదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో,*ఉపాధ్యక్షులు మెతరి కుమార్ , మున్సిపాలిటీ కోశాధికారి పట్నం రమేష్ కురుమ , కార్యదర్శులు బుతం రమణా గారు, సెక్టార్ అధ్యక్షులు లాపంగి రాజు ,సెక్టార్ ప్రధాన కార్యదర్శి రవి గారు* మరియు గిరిజన మహిళలు,పురుషులు పాల్గొన్నారు.