ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను నెరవేరుద్దాం
Published: Wednesday September 28, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 27 సెప్టెంబర్ ప్రజా పాలన : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు.
మంగళవారం జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టరు, జిల్లా రెవిన్యూ అధికారి అశోక్ కుమార్, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి మల్లేశం, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజీ, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, వెనుకబడిన సంక్షేమ శాఖ సహాయ అధికారి భీమా రాజులతో కలసి జ్యోతి వెలిగించి ఆచార్య బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమర యోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం అందరికి ఆదర్శమని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వారు నిరంతరం పాటుపడ్డారని, వారి ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు అహర్నిశలు కృషి చేసారని కలెక్టర్ గుర్తు చేశారు.
Share this on your social network: