మండల సంస్థాగత సభ్యుల ప్రమాణ స్వీకారం

Published: Tuesday October 05, 2021
బోనకల్, అక్టోబర్ 4, ప్రజాపాలన ప్రతినిధి : మధిరలో జరిగిన సంస్థాగత సభ్యుల ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసిన మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కేసీఆర్ ఆదేశం మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం జరిగిన బహిరంగ సభకు హాజరై జయప్రదం చేసిన నియోజకవర్గ ప్రజలకు, బోనకల్లు మండలంలోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులకు, టిఆర్ఎస్ కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేసినందుకు బోనకల్ మండలం టిఆర్ఎస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నూతనంగా ఎన్నిక కాబడిన కమిటీలు టిఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్ రాజు ఆదేశానుసారం పార్టీ మాపై నమ్మకం తో మాకు ఈ బాధ్యతలు అప్పజెప్పి నందుకు శక్తివంతంగా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాము. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జున రావు, మండల కార్యదర్శి మోదుగుల నాగేశ్వరావు, మండల రైతు కన్వీనర్ వేమూరి ప్రసాద్, మండల రైతు సంఘం అధ్యక్షుడు కాకాని శ్రీనివాస్ రావు, మాజీ జెడ్పిటిసి భానోత్ కొండ, కార్మిక సంఘం అధ్యక్షులు బంధం నాగేశ్వరావు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మూడవత్ సైదా, రావినూతల సర్పంచి కొమ్మినేని ఉపేందర్, చిన్న బీరవల్లి సర్పంచ్ పేరుబత్తిన శాంతయ్య, మండల కమిటీ సభ్యులు పుష్కల సురేష్, యార్లగడ్డ రమేష్ , దుర్గిబోయిన నాగయ్య, దారగాని నారాయణ, కొమ్మినేని సత్యనారాయణ, కేతినేని సత్యనారాయణ, మైనార్టీ నాయకులు షేక్ ప్రింటు సాహెబ్, షేక్ సైదా మరియు బీసీ సంఘం బోయినపల్లి రామయ్య తదితరులు పాల్గొన్నారు.