మధ్యాహ్నం భోజన కార్మిక సంఘం 2వ జాతీయ మహాసభల పోస్టర్ విడుదల

Published: Saturday October 29, 2022
మంచిర్యాల టౌన్, అక్టోబర్ 28, ప్రజాపాలన: మధ్యాహ్నం భోజన కార్మిక సంఘం 2వ జాతీయ మహాసభల పోస్టర్ ను లక్షేట్టిపేట్ మండల కేంద్రంలోని గర్ల్స్ హైస్కూల్ నందు శుక్రవారం రోజున తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ సి ఐ టి టి ఆధ్వర్యంలో విడుదల  చేశారు.ఈ సందర్బంగా మండల అధ్యక్షురాలు కాంతమ్మ మాట్లాడుతూ ఈ మహాసభలు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నందు నవంబర్ 4,5 తేదీలలో జరుగుతాయని తెలిపారు.దేశ వ్యాప్తంగా మధ్యాహ్నం భోజనం కార్మికులు ఎదుర్కొంటున్నా సమస్యల పరిష్కారం కొరకు భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం కొరకు ఈ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీకటి సత్తవ్వ, మల్లవ్వ, ఎల్లవ్వ, రజిత, పెద్ద మల్లవ్వ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.