మేజర్ గ్రామ పంచాయతీ లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల

Published: Monday June 21, 2021

ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి జూన్ 20(ప్రజా పాలన) : జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తో కలిసి ఉదయం నుండి ఆసిఫాబాద్  పట్టణములోని పలు ప్రాంతాలలో పర్యటిస్తూ పారిశుధ్య నిర్వహణ పై అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు, తమ తమ నివాస పరిసర ప్రాంతాలను సైతం శుభ్రంగా ఉంచుకోవాలని, అలా ఉంటేనే ఆరోగ్యాన్ని పరిరక్షించు కోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ రమేష్, ఈవో రాజబాబు, టిఆర్ఎస్ నాయకులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గాదేవినేని మల్లేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలువేరు వెంకన్న, మహిళా నాయకురాలు మంగ, నాయకులు సలాం, శైలేందర్, జావేద్, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.