చెరువు భూమిని అంగుళం కూడా కబ్జా కానీవ్వం

Published: Wednesday May 05, 2021
కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు
మేడిపల్లి, మే4 (ప్రజాపాలన ప్రతినిధి) : రామంతాపూర్ చిన్న చెరువు భూమిని అంగుళం కూడా కబ్జా కాకుండా కాపాడుతామని స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు తెలిపారు. చెరువు భూమిలో  పెద్ద ఎత్తున మట్టి పోసి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు మంగళవారం కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు చిన్న చెరువును పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ చిన్న చెరువు భూమిని అంగుళం కూడా కబ్జా కానివ్వమని, చెరువు చుట్టూ త్వరలోనే ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొంతమంది కబ్జాదారులు చెరువులో మట్టి పోస్తూ కబ్జాకు పాల్పడుతున్న విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎంతటి వారైనా సరే ఎవ్వరిని వదిలేదు లేదని, ఎవరైనా చెరువుకు సంబంధించిన భూమిలో కానీ చెరువులో కాని మట్టి కుప్పలు పోసి కబ్జాకు ప్రయత్నిస్తే జిల్లా కలెక్టర్ కు, మేయర్ కు ఫిర్యాదు చేసి అడ్డుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ అధ్యక్షుడు బండారు వెంకట్ రావు, గంగపుత్ర సంఘం ప్రతినిధి కాపర్తి మోహన్ కృష్ణ, కుమార స్వామి, తాళ్ల బాలకృష్ణ గౌడ్, కామేశ్వర రావు, నరసింహ రెడ్డి, నారాయణ దాసు, ప్రభాకర్ రెడ్డి, సునీల్, అక్తర్ మరియు స్థానికులు పాల్గొన్నారు