మందులు వేసిన సర్పంచ్ అలేఖ్యఅశోక్..

Published: Friday September 16, 2022
తల్లాడ, సెప్టెంబర్ 15 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని కేశవాపురం గ్రామంలో నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో  గ్రామ సర్పంచ్ వలిగండ్ల అలేఖ్యఅశోక్ చిన్నారులకు నులి పురుగుల మందులను వేసి ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ మాత్రలు మింగటం ద్వారా కడుపులో ఉన్న నులి పురుగులు చంపేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ రజిత, టీచర్ నాగేశ్వరరావు, అంగన్వాడి మాధవి, గంగమ్మ పాల్గొన్నారు.