వీరభద్రుడికి శ్రావణ మాస ప్రత్యేక పూజలు
Published: Tuesday August 10, 2021
గుమ్మడిదల, ఆగష్టు 09, ప్రజాపాలన ప్రతినిధి : మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో శ్రావణ మాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ శ్రావణ మాస ఉత్సవాలను ఎంపీపీ సద్ది ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి ఆలయ ఈ వో శశిధర్ తో కలిసి ప్రారంభించారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ఈ సందర్భంగా ఆలయ ఈ వో శశిధర్ మాట్లాడుతూ శ్రావణమాసం సందర్భంగా నెల రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. శ్రావణ మాసం మొదటి సోమవారం కావడంతో ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, లక్ష పత్రి పూజ, బిల్వార్చనలతో మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా పూజలను నిర్వహించారు. భద్రకాళి అమ్మవారి సన్నిధిలో భక్తులు కుంకుమార్చన లు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సురభి నాగేందర్ గౌడ్, నాయకులు ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, కూన వేణు, భద్రప్ప, జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ నారాయణ, వినోద్ గౌడ్, ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ పర్యవేక్షకులు సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: