కరోనా పై ప్రజలకు అవగాహనా కల్పిచిన సర్పంచ్ రాజు నాయక్

Published: Saturday April 24, 2021
గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు

పరిగి 23 ఏప్రిల్ ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం,దోమ మండల పరిధిలోని మైలారం గ్రామంలో స్థానిక  సర్పంచ్ రాజు నాయక్ వార్డ్ మెంబెర్స్ తో గ్రామ పెద్దలతో పలు అంశాలు పై చర్చించటం జరిగింది. ఈ సందర్బంగా  రాజు నాయక్ మాట్లాడుతూ కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించి  అత్యవసర అవసరమైతే తప్ప బయటికి వెళ్లకూడదని సూచించారు.అల్లాగే గ్రామంలో జరిగే అభివృద్ధి  పనులను చేయుట గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాములు, ఉపసర్పంచ్. నర్సిములు, వార్డ్ మెంబెర్స్ ,హరిచందర్ జేమ్ల్. ఉమలత. పి.వెంకటమ్మ. కార్యదర్శి అంజమ్మ పాల్గొన్నారు.