సాగర్ జలాలు చివరి భూముల వరకు నీరు అందిస్తాం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు
బోనకల్, మార్చి 01 ప్రజా పాలన ప్రతినిధి: సాగర్ జలాలు చివరి భూముల వరకు సాగర్ నీరందిస్తామని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు రైతులకు భరోసా కల్పించారు. బుధవారం రైతులతో కలిసి ఆయన సాగర్ జలాలను పరిశీలించారు. రైతులు ప్రజాప్రతినిధులు కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా నేరుగా సమస్యలను తెలుసుకోవడానికి అళ్ళపాడు,రావినుతల, చిరునోముల,పోలంపల్లి, లింగాల,వత్సవాయి బ్రాంచ్ కెనాల్ పరిధిలో అధికారులు ,రైతులతో కలిసి కాలినడకన ఆయన సాగర్ జలాలను పరిశీలించారు. రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. చిన్న చిన్న సమస్యలు రైతులు వివరించగా, ప్రత్యెక శ్రద్దతో తక్షణ పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు, నేరుగ రైతుల వద్దకు వచ్చి, సమస్యలను తెలుసుకున్న జడ్పీ చైర్మన్ కమల్ రాజుకు రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జున రావు, మాజీ అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, మండల కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ, మండల రైతు కన్వీనర్ వేమూరి ప్రసాద్, రావినూతల సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ సైదా, నాయకులు తన్నీరు పుల్లయ్య, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
Share this on your social network: