కార్పొరేషన్లో రోడ్ల అభివృద్ధికి కృషి మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Published: Friday April 08, 2022
మేడిపల్లి, ఏప్రిల్ 7 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో  రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని మేయర్ జక్క వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కార్పొరేషన్లోని 24వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ అనంత రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ లతో కలిసి మేయర్ వెంకట్ రెడ్డి సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ రావు, కార్పొరేటర్లు భీమ్ రెడ్డి నవీన్ రెడ్డి, మధుసుదన్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పప్పుల అంజిరెడ్డి, యాసారం మహేష్, వీరమల్ల సత్యనారాయణ, కో ఆప్షన్ మెంబర్ జవీద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.