పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
Published: Friday July 02, 2021
మేడిపల్లి, జులై 01 (ప్రజాపాలన ప్రతినిధి) : పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, కార్పొరేటర్ దొంతరబోయిన మహేశ్వరి కృపసాగర్ ముదిరాజ్ తెలిపారు. 22వ డివిజన్ కార్పొరేటర్ మహేశ్వరి కృపసాగర్ ఆధ్వర్యంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి మొక్కలు నాటే హరితహార కార్యక్రమాన్ని ప్రారంభించారు. డివిజన్లో పట్టణ ప్రగతిలో చేయాల్సినపనుల కార్యాచరణ ప్రకటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రోడ్డు ఇరుపక్కన మొలిచిన పిచ్చి మొక్కలను తొలగించడం, ఒపెన్ ప్లాట్స్ లో పేరుకున్న చెత్తను శుభ్రపరచడం, మురుగునీరు నిలవకుండా, దోమలను నివారించే విధంగా చూసుకోవాలని, డ్రయినేజి సమస్యలను గుర్తించి శాశ్వత పరిష్కరించడం చేయడం, వర్షాకాలంలో నీళ్ళునిలవకుండా చేయడం, చెట్లకొమ్మలు తగలకుండా విద్యుత్ వైర్లను సరిచేసుకోవడం, మంచినీటి వ్యవస్థను సరిచూసుకోవడం లాంటి అభివృద్ది పనులను చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జగన్, కార్యకర్తలు, వార్డ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: